నాగర్‌కర్నూల్‌లో తాంత్రిక పూజల పేరుతో 11 మంది హత్యలు: నిందితుడు అరెస్ట్

477

నాగర్‌కర్నూల్‌లో తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రామటి సత్యనారాయణగా గుర్తించారు.

తాంత్రిక పూజలు చేసి గుప్త నిధులు సేకరిస్తానని అమాయకులను నమ్మించేవాడు సత్యనారాయణ. వారి నుంచి డబ్బు తీసుకోవడంతో పాటు స్థలాలు, భూములు రాయించుకునేవాడు. ఆ తర్వాత నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హతమార్చేవాడు.

వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, కర్ణాటకలోని బలగనూరు, ఏపీలోని అనంతపురంలో ఈ హత్యలు జరిగాయి. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్‌ పోసి చంపేవాడు.

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్‌ను హైదరాబాద్‌లోని బొల్లారంలో హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.

నిందితుడి నుంచి కారుతో పాటు మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులు, విష పదార్థాలు, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top