ఖమ్మం జిల్లా ఏన్కూరులోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం (జనవరి 21) ట్రాన్స్జెండర్ల ప్రేమ వివాహం జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన నందు అనే యువకుడు, ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన నక్షత్ర అనే ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకున్నాడు. నందు, నక్షత్రలు కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుని ట్రాన్స్జెండర్ సంఘం సభ్యులకు తెలపగా.. వారు దగ్గరుండి వివాహం జరిపించారు.
వివాహానికి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల ట్రాన్స్జెండర్లు హాజరయ్యారు. వివాహం ఘనంగా జరిగింది. ట్రాన్స్జెండర్ల ప్రేమ వివాహం జరిగినందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వివాహం ట్రాన్స్జెండర్లకు ఒక కొత్త భవిష్యత్తును సూచిస్తుందని ట్రాన్స్జెండర్ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు.
ట్రాన్స్జెండర్ల హక్కులపై అవగాహన పెంచడానికి ఈ వివాహం ఒక మంచి అవకాశమని వారు అన్నారు. ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో సమానమైన హక్కులను కలిగి ఉండాలని వారు డిమాండ్ చేశారు.