ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని విఠలాపురంలో చోటు చేసుకుంది.
ఏఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఊస్సేన్సాబ్, ఖాజాబీకి ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె షెహనాబీ (19) హైదరాబాద్లో డిగ్రీ రెండో సంవత్సరం చదివేది.
క్షమించండి అమ్మ నాన్న.. నేను చనిపోతున్నా టీచర్ మీకు కూడా...
ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామానికి చెందిన ఖాజా సమీప బంధువు కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లికి యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గద్వాలకు అటు నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తండ్రి ఊస్సేన్సాబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ వివరించారు.