గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలుశిక్ష

402

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తికి జైలుశిక్ష పడింది. ఏపీ హైకోర్టు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు నెల రోజుల జైలు శిక్షతోపాటు రూ.

2000 జరిమానా విధించింది. జనవరి 2వ తేదిలోగా హై కోర్టు రిజిష్టర్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యడవలి వారి సత్రం అక్రమంగా అక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ రన్ చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. యడవలి వారి సత్రానికి రూ.25లక్షలు చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన కారణంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top