నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం... 10 మందికి గాయాలు

922

హైదరాబాద్‌: నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపైకి  వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇంజిన్ తో  సహా మూడు బోగీలు పట్టాలు తప్పినట్టు గా రైల్వే అధికారులు వెల్లడించారు ఇంజన్ ప్లాట్ఫారం సైడ్ వాల్ ఢీకొట్టిందని  ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని ఈ ప్రమాదంలో ఆస్తి నష్టంపై ఇంకా అంచనా వేయలేదని  సీపీఆర్వో రాకేష్‌ తెలిపారు 

Also Read : గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి

స్టేషన్ ప్లాట్ ఫామ్ పై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి వెళ్లే ఇతర రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇంజిన్ తో పాటు మూడు బోగీలును తిరిగి పట్టాలపైకి తెచ్చేందుకు రైల్వే అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉదయం 9.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైలులోని ఇంజిన్ తో  సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి అని ఈ ఘటనలో రైలు డోర్ల దగ్గర నిల్చున్న ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయని వారికి రైల్వే ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని  దక్షిణ మధ్య రైల్వే  సీపీఆర్వో రాకేశ్  వెల్లడించారు దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాతే రైలు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top