క్షమించండి అమ్మ నాన్న.. నేను చనిపోతున్నా టీచర్ మీకు కూడా...

206

ఇద్దరు విద్యార్థులకు సర్దిచెప్పి వారిని గాడిలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు చిన్నారి విషయంలో కఠినంగా వ్యవహరించారు. ఆమె అన్న మాటలను భూతద్దంలో చూపి ప్రార్థనా సమయంలో ప్రధానోపాధ్యాయులు, తోటి విద్యార్థుల ఎదుట చెప్పి చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో మనస్తాపానికి గురైన బాలిక... ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. ఈ నెల 20న బాలిక ఆత్మహత్య చేసుకోగా ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌, మరణానికి ముందు రికార్డు చేసిన వీడియో తాజాగా శుక్రవారం వెలుగుచూశాయి. కుప్పం మండలం నూలుకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్‌.రమ్య (13) తొమ్మిదో తరగతి చదువుతూ క్లాస్‌ లీడర్‌గా ఉంది. కొన్ని రోజుల క్రితం ఓ విద్యార్థి అల్లరి చేయడాన్ని చూసి తప్పని చెప్పగా, ఆ విషయం ప్రధానోపాధ్యాయుడి వరకూ వెళ్లింది. ఆయన బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్న బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌ చేయడంతో ఆమె మనోవేదనకు గురైంది.

BRS: మాజీ ఎమ్మెల్యే రాసలీలలు..! సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..!!

ఇటీవల మరో విద్యార్థి అల్లరి చేయగా, రమ్య కొట్టింది. ఈ విషయం ఓ ఉపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో ఆయన రమ్యను మందలించారు. తాజాగా తరగతి గదిలో గొడవ చేస్తున్న ఒకరిని పద్ధతిగా ఉండాలని చెప్పింది. ఈ మాటలు విన్న ఆ ఉపాధ్యాయుడు.. సదరు విద్యార్థిని కులం పేరుతో దూషించావంటూ వేధించారు. ఆ విషయాన్ని అందరికి చెబుతాననడంతో నేను ఏ తప్పూ చేయలేదని, అల్లరి చేస్తున్న బాలుడిని దారిలో పెట్టేందుకే అలా మాట్లాడానని చెప్పినా ఉపాధ్యాయుడు వినిపించుకోలేదు. అందరి ముందు చర్యలు తీసుకుంటానని చెప్పడంతో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఉరేసుకుంది. అందరిముందు తన పరువు పోతుందనే చనిపోతున్నానని, తనకు ఇష్టమైన టీచర్లు రవి, సునీత, కమల, ఆంజనేయులు, జగన్నాథం, శివశంకర్‌, హెచ్‌ఎం సార్‌ను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని వేడుకుంది. దశరథన్‌ సార్‌ నన్ను ఎంత తిట్టినా కొట్టినా ఇష్టమేనని అందులో రాసింది.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top