సింగరేణి సిండికేట్ పరిధిలోని ఐదు కార్పొరేట్ యూనియన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్లో ఐఎన్టీయూసీ అభ్యర్థి చింతల సోమశేఖర్ 4,281 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మణుగూరు సింగరేణి కార్పొరేట్లోనూ ఐఎన్టీయూసీ అభ్యర్థి రాజన్న 3,674 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
బెల్లంపల్లి సింగరేణి కార్పొరేట్లో ఏఐటీయూసీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ 3,574 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇల్లెందు సింగరేణి కార్పొరేట్లో ఐఎన్టీయూసీ అభ్యర్థి బాబ్జీ 2,669 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
Also Read : 2024 జనవరిలో బ్యాంక్ సెలవుల జాబితా
సింగరేణి ఎన్నికల్లో కీలకంగా మారిన శ్రీరాంపూర్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఫలితాలు శుక్రవారం తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.