పాకిస్థాన్లోని కరాచీకి చెందిన జావేరీ ఖనూమ్ అనే అమ్మాయి కోల్కతాకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి భారత్కు వచ్చింది. వాఘా బోర్డర్ నుంచి మంగళవారం ఇండియాకు చేరుకుంది. వీరి వివాహం జనవరిలో జరగనుంది. దీంతో అబ్బాయి సమీర్ ఖాన్, వారి కుటుంబ సభ్యులు సరిహద్దు వద్ద జావేరీకి ఘన స్వాగతం పలికారు. గతంలో జావేరీకి రెండు సార్లు బారత్ వీసాను తిరస్కరించగా.. తాజాగా 45 రోజుల పాటు భారత్ వీసాను మంజూరు చేసింది.
Also Read: వరుణ్ తేజ్-లావణ్య భవిష్యత్తులో విడిపోతారు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని, ఇండియాలో ఎంతో ప్రేమ లభించిందని తెలిపారు. కోవిడ్ కారణంగా వీరి పెళ్లి ఐదేళ్ల పాటు నిలిచిపోయింది. కాగా, 2018లో తమ పరిచయం మొదలైందని.. జర్మనీలో చదువుకుంటున్న సమయంలో ఇంటికి వచ్చినప్పుడు తన తల్లి మొబైలో జావేరీ పోటో చూశానని, అప్పటి నుండి ప్రేమలో ఉన్నట్లు సమీర్ ఖాన్ తెలిపారు.