రౌడీషీటర్‌ను నరికి చంపిన నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతం

565

కాంచీపురం, డిసెంబర్ 28, 2023: తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో మంగళవారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. పుదుపాళయం ప్రాంతానికి చెందిన ప్రభాకరన్ (35) అనే రౌడీషీటర్‌ను కారులో వచ్చిన రఘు, ఉసేన్ అనే ఇద్దరు నిందితులు కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులు పారిపోయి దాక్కున్నారు. వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

Also Read : సింగరేణి ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ విజయం

ఈ ఘటనపై కాంచీపురం జిల్లా ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ, "ప్రభాకరన్‌పై రఘు, ఉసేన్ అనే ఇద్దరు నిందితులు గతంలో కొన్ని కేసులు పెట్టారు. ఈ కేసులపై ప్రభాకరన్ వారికి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఆగ్రహంతో ఉన్న నిందితులు ప్రభాకరన్‌ను చంపారు" అని తెలిపారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top