బిగ్ బాస్ హౌస్ లోకి షకీలా ఎంట్రీ..

43

ఇంతవరకు మీరు చూసిన ఆట వేరు.. ఈ సీజన్ లో మీరు చూడబోయే ఆట వేరు అంటూ రంగంలోకి దిగారు బిగ్ బాస్. కొద్ది సేపటి క్రితం ఈ సీజన్ తొలి ఎపిసోడ్ షురూ అయింది.

గతంతో పోల్చితే ఈ సారి బిగ్ బాస్ షో మరింత ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. ఉల్టా పుల్టా.. ఈ సీజన్ మామూలుగా ఉండదు.. మీ అంచనాలకు అందనట్టుగా ఉంటుందంటూ ఇప్పటికే ప్రోమోలతో స్పష్టం చేశారు హోస్ట్ నాగార్జున (Nagarjuna). అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేసి మొత్తానికి రంగంలోకి దిగారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్, హోస్ట్ నాగార్జున లుక్ మరింత డిఫరెంట్ గా ఉండనుంది. నేడు (ఆదివారం) సెప్టెంబర్ 03 రాత్రి 7 గంటలకు ఈ షో షురూ అయింది. అయితే ఈ సీజన్ లో తొలి కంటిస్టెంట్ గా టీవీ సీరియల్ (జానకి కలగనలేదు) యాక్ట్రెస్ ప్రియాంక జైన్ తొలి కంటిస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా శివాజీ, సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆరో కంటిస్టెంట్ గా మాజీ శృంగార తార షకీలా (Shakeela) గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన కష్టాలు చెబుతూ ఏవీ ఇచ్చింది. షకీ అమ్మగా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పింది షకీలా. ఆమెకు ఎంతో ఇష్టమైన ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా వేదికపైకి పిలిచారు నాగ్. ట్రాన్స్‌జెండర్స్‌ తో తనకున్న అనుబంధాన్ని చెబుతూ కొన్ని సీక్రెట్స్ చెప్పిన షకీలా.. నాగార్జున ముందు షకీలా ఎమోషనల్ అయింది. ట్రాన్స్‌జెండర్స్‌ మేలు కోసం తాను చేస్తున్న కృషి చెప్పింది.

Also Read: Shakeela: మొదటిసారి నేను నా శరీరాన్ని ఆయనకు సమర్పించాను! ఆయన పేరు...!

మీరు తెర మీద చూసిన షకీలా వేరు.. నిజ జీవితంలో చూసే షకీలా వేరు అంటూ ఆమె గురించి గొప్పగా చెప్పారు నాగార్జున. ఆమెలో డిఫరెంట్ కోణం ఉందని తెలిపారు. ఆ తర్వాత హౌస్ లోకి వెళ్ళగానే అప్పటికే హౌస్ లోకి వచ్చిన కంటిస్టెంట్స్ ఆమెకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top