ఒకేసారి చేతికి రూ.64 లక్షలు.. ఆడపిల్లలకు సూపర్ స్కీమ్..

124

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. ఏ దేశంలో చూసినా ఇన్‌ఫ్లేషన్ లిమిట్ దాటి కలవరపెడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల వస్తువులు, సేవలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పిల్లల ఉన్నత చదువులు, వివాహం, సొంతిల్లు వంటి కలలు నెరవేర్చుకోవడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారిపోయింది. ఇలాంటి ముఖ్యమైన అవసరాలను తీర్చుకునే ప్రయత్నంలో అప్పుల పాలు కాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైనంత త్వరగా స్థిరమైన, సురక్షితమైన రాబడి అందించే పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం చాలా ముఖ్యం. ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదుపు పథకాలను అందిస్తోంది. వీటి ద్వారా పెట్టుబడికి హామీ ఉంటుంది. ముఖ్యంగా ఆడ పిల్లల చదువు, పెళ్లి అవసరాలకు కేంద్రం లాంఛ్ చేసిన సుకన్య సమృద్ధి యోజన బెస్ట్‌ ఆప్షన్‌‌గా చెప్పవచ్చు. ఈ స్కీమ్‌లో ప్రతి నెలా స్థిరంగా పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో ఫండ్‌ క్రియేట్‌ చేయవచ్చు.ఈ స్కీమ్‌ 21 సంవత్సరాల సుదీర్ఘ లాక్-ఇన్ పీరియడ్‌ని కలిగి ఉంది. అంటే మెచ్యూరిటీ పీరియడ్‌కి ముందు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన డబ్బును విత్‌డ్రా చేసుకోలేరు.

కుమార్తె జన్మించిన వెంటనే సుకన్య సమృద్ధి ఖాతా తెరవడం ఉత్తమ సమయంగా చెప్పవచు. ఆడ పిల్లకు 10 ఏళ్లు నిండకముందే ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖాతా తీసుకునేందుకు అవకాశం లేదు. పుట్టిన వెంటనే అకౌంట్‌ ఓపెన్‌ చేయడం వల్ల 15 సంవత్సరాల పాటు స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశం లభిస్తుంది. దీంతో పెద్ద మొత్తంలో అమౌంట్ చేతికి వస్తుంది.

Also Read: నెలకు రూ.200 కడితే.. సంవత్సరానికి రూ.72 వేలు వస్తాయి..!

ప్రతి మూడు నెలలకోసారి ఈ పథకం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది. 2023 జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేటు సంవత్సరానికి 8 శాతం కల్పించింది కేంద్రం. కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తర్వాత మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆమెకు 21 ఏళ్లు వచ్చినప్పుడు మిగిలిన బ్యాలెన్స్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి యోజనలో ప్రతి నెలా రూ.12,500 లేదా రోజుకు రూ.416 డిపాజిట్ చేస్తే ఏడాది మొత్తం చేసిన కాంట్రిబ్యూషన్లు రూ.1.5 లక్షలు అవుతాయి. ఇది పూర్తిగా పన్ను రహితం. అంటే మీ పెట్టుబడి, వడ్డీపై ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ వడ్డీ రేటు 7.6 శాతంగా భావిస్తే, మెచ్యూరిటీ నాటికి కుమార్తె కోసం గణనీయమైన ఫండ్‌ను క్రియేట్‌ చేయవచ్చు.

Also Read: కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ సూత్రం తెలుసుకోండి

కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి మొత్తం డబ్బు విత్‌డ్రా చేస్తే.. రూ.63,79,634 అందుతుంది. ఇందులో మొత్తం పెట్టుబడి రూ.22,50,000 కాగా, వడ్డీ ఆదాయం రూ.41,29,634లు ఉంది. నెలవారీ రూ.12,500 స్థిరంగా డిపాజిట్ చేయడం ద్వారా, కుమార్తె భవిష్యత్తు కోసం రూ.64 లక్షలు ఒకేసారి పొందవచ్చు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top