హైదరాబాద్: మంగళవారం కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం తొమ్మిది కేసులు చికిత్స పొందుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం మొత్తం 402 టెస్టులు చేశారు.
Also Read : కామన్ మ్యాన్ గా సీఎం రేవంత్ ప్రయాణం!
20-60 ఏళ్ల మధ్య వయస్కులు ఈ వేరియంట్ బారిన పడే అవకాశం ఉందని పేర్కొంటూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, 60 ఏళ్లు పైబడిన వారు ఆరుబయట కార్యకలాపాలను పరిమితం చేయాలని, బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు.
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మంత్రి దామోదర రాజనర్సింహ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, గత అనుభవాల ఆధారంగా వ్యూహాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జేఎన్.1 వేరియంట్ నేపథ్యంలో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి పరిస్థితి నివేదికలను ప్రభుత్వం కోరింది.