సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం చెందిన సాయి నవ్య(26), మోహన్ భార్య భర్తలు, వీరు చండీగఢ్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు వీరికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రోజున వివాద యాత్ర కోసం హిమాచల్ప్రదేశ్లోని కులూకు వెళ్లారు
ఆదివారం మధ్యాహ్నం సాఫ్ట్వేర్ ఉద్యోగిని నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా కొద్దిసేపటికే ప్రమాదవశాత్తు ఓ ఇంటి పైకప్పు పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది ఆమెతో పాట ప్రయాణం చేస్తున్న పైలెట్ ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు ఈ ప్రమాదంపై స్పందించిన హిమాచల్ ప్రదేశ్ అధికారులు మానవ తప్పిదం వల్లనే ఈ సంఘటన జరిగిందని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పైలెట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. కులులో నవ్య మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అధికారులు సోమవారం మృతదేహాన్ని విమానంలో శంషాబాద్ ఏయిర్పోర్టుకు తరలించారు. వీడియో కాల్ మాట్లాడిన కొంతసేపటికి ఈ ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి