శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసిన తమిళనాడుకు చెందిన 18 మంది భారతీయ మత్స్యకారులు మంగళవారం కొలంబో నుంచి స్వదేశానికి విమానంలో చేరుకున్నారు. వీరికి తమిళనాడు మత్స్యశాఖ అధికారులు, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు
సముద్ర ఉల్లంఘనల ఆరోపణలపై గత నెలలో మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసి అక్కడి జైలులో ఉంచింది. వారిని విడుదల చేయాలని శ్రీలంక స్థానిక కోర్టు ఆదేశించిందని, ఆ తర్వాత వారిని అక్కడ శిబిరంలో ఉంచామని అధికారులు తెలిపారు
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో మత్స్యకారులు రోడ్డు మార్గం ద్వారా రామనాథపురానికి బయలుదేరారు