తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఒక వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్ ORR రింగ్ రోడ్డుపై కారులో వైద్య విద్యార్థిని అపస్మారక సిత్థిలో ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీనిపై స్పందించిన స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించాక వైద్య విద్యార్థిని మత్తు ఇంజెక్షన్ తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగు గంటలకు వైద్య విద్యార్థిని రచనా రెడ్డి ప్రాణాలు వదిలింది. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి (25) మృతిపై అమీన్పూర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది