ఉయ్యాలను తన్నడంతో పసికందు మృతి

52

మద్యం మత్తులో ఓ కన్నతండ్రి విచక్షణ కోల్పోయి ప్రవర్తించడంతో 45 రోజుల పసికందు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దశంకరంపేటకు చెందిన చిమ్మ పున్నయ్య, శ్యామలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్దకుమార్తె నిర్మలను మండల పరిధిలోని ఉత్తులూర్‌కు చెందిన జన్ముల రమేష్‌కు ఇచ్చి వివాహం చేశారు.

Also Read: మేకను ఎత్తుకెళ్లారని ఇద్దరికి చిత్రహింసలు

వీరికి ఇద్దరు కుమారులున్నారు. నిర్మల ఇటీవల జశ్వంత్‌(45 రోజులు)కు జన్మనివ్వడంతో తల్లిగారి ఇంటికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం కొడుకును చూడటానికి రమేష్‌ అత్తగారింటికి వచ్చాడు. రాత్రి మద్యం సేవించి అత్తమామలతో గొడవ పడ్డాడు. తాగి ఉన్నాడని కొడుకు వద్దకు వెళ్లొద్దన్నందుకు రమేష్‌ ఆగ్రహించాడు. బాబు పడుకున్న ఉయ్యాలను బలంగా తన్నాడు.

ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య పెనుగులాట జరగడంతో బాలుడు మృతి చెందాడు. నిర్మల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top