క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ముంబయి ఇండియన్స్-రోహిత్ శర్మ గురించే చర్చ జరుగుతోంది. ముంబయి కెప్టెన్గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను నియమించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ముంబయి మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్ను అన్ఫాలో చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే అంశం ట్రెండింగ్లో ఉంది.
ఈ క్రమంలోనే టీమ్ఇండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ఖాతా కొత్త ప్రొఫైల్ పిక్ వైరల్గా మారింది. చాహల్, రోహిత్ శర్మపై తనకున్న అభిమానాన్ని చాటుతూ వారిద్దరూ ఓ మ్యాచ్ సందర్భంగా దిగిన ఫొటోను ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాడు.
Also Read : అఫ్గానిస్థాన్ ఫాస్ట్ బౌలర్ నవీనుల్ హక్పై ILT20 నిషేధం
రోహిత్ను ముంబయి కెప్టెన్గా తొలగించడంతో అతనికి మద్దతుగా నిలిచేందుకు చాహల్ ఇలా ప్రొఫైల్ పిక్ని ఛేంజ్ చేశాడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.