రేవంత్ రెడ్డిని సీఎంగా చేసింది చంద్రబాబే... డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్

107

తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం( Thursday) ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై ఆంధ్రప్రదేశ్ డిప్యుటీ సీఎం నారాయణస్వామి(Narayana swamy) సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys Jagan)డా,, బిఆర్ అంబేద్కర్ ఆశయాలైన విద్య, వైద్యానికి అధిక ప్రాముఖ్యతనిస్తూ దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం ఉండేలా ప్రజల మన్నన పొందే విధంగా ప్రజాపాలన సాగిస్తున్నారని పొగిడిన నారాయణస్వామి ..వెంటనే తెలంగాణ రాజకీయాలు, చంద్రబాబు, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలుచేశారు.తెలంగాణలో రేవంత్ సీఎం అవ్వడం ద్వారా ఆ పార్టీ నాయకులకు ఉపయోగం ఉంటుందని అందుకే తెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టించి చంద్రబాబు రేవంత్ రెడ్డి ని గెలిపించారని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల సంక్షేమం కన్నా తన సంక్షేమం పైనే శ్రద్ద ఉంటుందని ఎల్లో మీడియాను వాడుకొని రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు బాబు కుట్రలను చేసారంటూ తీవ్ర సంచలన కామెంట్స్ చేశారు ఏపీ డిప్యుటీ సీఎం.

Also Read: ఓటమి తర్వాత KCR ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారో తెలుసా

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ని గద్దె దించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడేనంటూ సంచలనం వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబును విమర్శించిన నారాయణస్వామి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డినిపొగడ్తలతో ముంచెత్తారు. దేశంలోనే ప్రజారంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పేదల కోసం అహర్నిశలు శ్రమించే నేత అని అన్నారు.

మరి కొన్ని గంటల్లో సీఎం కాబోతున్న రేవంత్ రెడ్డి….చంద్రబాబు బంధంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణస్వామి. తెలంగాణ ఎన్నికలు అధిక శాతం మాత రాజకీయాలకు ముడిపెట్టరని నారాయణ స్వామి ఆరోపించారు. ఒక మతపరమైన అంశంపైనే అక్కడి రాజకీయం మొత్తం సాగిందని చెప్పారు. కేవలం మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఎన్నికలలో కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రచారం సాగాయని… ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కుల., మతాలను రెచ్చ గొట్టి గెలిచిందన్నారు. ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డి కోసమే టీడీపీ ఎన్నికలో పోటీచేయలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిపారు. అక్కడ రేవంత్ సీఎం అవ్వడం ద్వారా ఆ పార్టీ నాయకులకు ఉపయోగం ఉంటుందని అందుకే తెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టించి చంద్రబాబు రేవంత్ రెడ్డి ని గెలిపించాడని పేర్కొన్నారు.

Also Read: Telangana: డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క

చంద్రబాబుకు ప్రజల సంక్షేమం కన్నా తన సంక్షేమం పైనే శ్రద్ద ఉంటుందని ఎల్లో మీడియా ను వాడుకొని రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు బాబు కుట్రలను చేసారన్నారు. కెసిఆర్ ని గద్దె దించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గా కూర్చోబెట్టాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికి తెలుగు దేశం పార్టీ వాడేనని సంచలనం వ్యాఖ్యలు చేశారు నారాయణ స్వామి.

.డా. బీ ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన సమయంలో ఏపీ డిప్యుటీ సీఎం నారాయణ స్వామి రేపు ప్రమాణం చేయనున్న రేవంత్ రెడ్డిపై ఇలాంటి కామెంట్స్ చేయడంపై రాజకీయంగా కలకలం రేపుతోంది. దీనికి టీడీపీ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top