బోనకల్ మండలంలో (ఎల్) గోవిందాపురం గ్రామంలోని ఎసుపోగు వెంకటేశ్వర్లు అనే రైతు పండించిన పత్తిని ఒక రూమ్లో స్టోర్ చేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు పత్తికి నిప్పు పెట్టారు.
Also Read : 2024 జనవరిలో బ్యాంక్ సెలవుల జాబితా
ఈ ఘటనను గమనించిన స్థానికులు రైతుకు సమాచారం అందించారు. వెంటనే రైతు ఘటనా స్థలానికి చేరుకుని పత్తి కాలిపోయిన దృశ్యాన్ని చూసి ఆవేదన చెందాడు.
ఘటన గురించి సమాచారం అందుకున్న మండల స్థానిక ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటామని అన్నారు.