బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కునేవారి కోసం మరో కొత్త పథకం తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంతో తెలంగాణలో ఇళ్లు లేని కుటుంబమంటూ లేకుండా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త స్కీమ్ గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు.
ఈ స్కీమ్ ద్వారా 1200, 1500 చదరపు గజాల ఇళ్లు కొనే మధ్య తరగతి ప్రజల కోసం వడ్డీ లేకుండా హోమ్ లోన్ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అమలు చేస్తోన్న డబుల్ బెడ్ రూమ్, గృహాలక్ష్మీ పథకాలతో పాటుగా ఈ కొత్త స్కీమ్ను కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తప్పకుండా హౌసింగ్ ఫర్ ఆల్ నినాదాన్ని అమలు చేసి చూపిస్తామని అన్నారు.