నెల రోజుల క్రితం పెళ్లి.. సముద్రంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న యువ జంట

397

ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఓ యువ జంట అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయింది.. ఆ బీచ్‌లో ఉన్నవాళ్లు అంతా చూస్తుండగా..

సముద్రంలోకి వెళ్లారు.. వెనక్కి రావాలంటూ అక్కడున్నవాళ్లు ఎంత అరచినా పట్టించుకోకుండా వెళ్లిపోయి.. గల్లంతయ్యారు.. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also.Read: Bigg Boss Telugu 7: ఎలిమినేషన్ లో శివాజీ కాళ్ళ మీద పడి బోరున ఏడ్చేసిన శోభా శెట్టి

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అయితే, కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి బయటకు వచ్చారు ఆ నవ దంపతులు.. ఇద్దరు చేతులకు చున్నీ కట్టుకుని అంతర్వేది బీచ్ సమీపంలో 500 మీటర్ల దూరంలో అందరూ చూస్తుండగానే సముద్రంలోకి వెళ్లిపోయారు.. వారు సముద్రంలోనకి వెళ్తున్న దృశ్యాలను చూసిన బీచ్‌లో ఉన్నవారు.. వారిని వారించే ప్రయత్నం చేశారు.. వెనక్కి రావాలంటూ కేకలు వేశారు.. అయినా ఆ ఇద్దరు అలా సముద్రంలోకి వెళ్లి అదృశ్యమయ్యారు.. దీంతో, సమీపంలో ఉన్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ఇప్పటి వరకు ఆ యువ జంట జాడ చిక్కలేదు.. సముద్రం ఒడ్డున వదిలిన ఫోన్ ఆధారంగా పేరెంట్స్ కు సమాచారం ఇచ్చిన సఖినేటిపల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top