టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి తాజాగా ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ రమ్యకృష్ణ వైసీపీలో చేరబోతున్నారని, అందుకే తన తోటి నటి, ఏపీ మినిస్టర్ రోజాతో మీట్ అయ్యిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఈ హీరోయిన్ స్పందించి.. ‘‘రోజా వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో త్వరగా దర్శనమయ్యేందుకు రోజానే కారణం. అంతేకాకుండా ఆమెను చూసి కూడా చాలా రోజులయ్యింది. తనతో మాట్లాడటానికి రోజా ఆహ్వానం మేరకే తన ఇంటికి వెళ్లాను. పాలిటిక్స్కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి ఆలోచన ఉన్నట్లయితే స్వయంగా నేనే వెల్లడిస్తాను. ఏ పార్టీలో చేరుతానన్నది కూడా అప్పుడే క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతం నా పిల్లలు, ఫ్యామిలీ గురించే నా ఆలోచన అంత.’’ అంటూ రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
రాజకీయాల్లోకి రమ్యకృష్ణ ఎంట్రీ..
8 months, 3 weeks
53
Tags
Share to other apps