విజయవాడ డివిజన్ పరిధిలోని ఒంగోలు-నెల్లూరు సెక్షన్లో సోమవారం ముమ్మరంగా టికెట్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించినట్లు రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మహ్మద్ అలీఖాన్ పర్యవేక్షణలో నెల్లూరు, ఒంగోలుకు చెందిన స్క్వాడ్ టీటీఈలు ఈ డ్రైవ్ నిర్వహించారు.
మొత్తం 417 కేసులు నమోదు కాగా, అందులో 318 టికెట్ లేని ప్రయాణం, 99 అక్రమ ప్రయాణాలు, టికెట్ చెకింగ్ సిబ్బంది రూ.2.86 లక్షలు, రూ.49,600 జరిమానా వసూలు చేశారు.
బెర్త్/సీనియర్ సిటిజన్ కోటాను దుర్వినియోగం చేసిన 12 కేసులను గుర్తించామని, ప్రయాణికులు తప్పుడు వయస్సు ఇచ్చి సదరు కోటా కింద టికెట్లు బుక్ చేసుకున్నారని మహ్మద్ అలీఖాన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులను టికెట్ లేకుండా ప్రయాణించినట్లుగా పరిగణించి తదనుగుణంగా జరిమానా విధిస్తారు.
క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ నెల్లూరు రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అన్ని స్టాల్స్, ప్రధాన యూనిట్లలో సరఫరా చేసే భోజనం, స్నాక్స్ నాణ్యతను పరిశీలించారు. రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్యాకింగ్ మెటీరియల్, పరిశుభ్రత పరిస్థితులు, గడువు తేదీ, వెండింగ్ పర్మిట్ల లభ్యత, స్టాళ్ల వద్ద విక్రేతల మెడికల్ సర్టిఫికేట్లను అధికారులు పరిశీలించారు.