సూర్యకుమార్ యాదవ్ 2023 డిసెంబర్ 12న సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 2000 పరుగుల మార్కును తాకిన సూర్యకుమార్ యాదవ్, 1164 బంతుల్లోనే ఈ మార్కును తాకడంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఈ రికార్డుతో పాటు స్కై మరో రెండు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
- ఇన్నింగ్స్ల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 56 ఇన్నింగ్స్ల్లో ఈ మార్కును అందుకోగా, పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, అదే దేశానికి చెందిన మొహమ్మద్ రిజ్వాన్ (52 ఇన్నింగ్స్ల్లో) ఈ విభాగంలో అందరి కంటే ముందున్నారు.
- టీమిండియా తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. స్కైకు ముందు విరాట్ కోహ్లి (107 ఇన్నింగ్స్ల్లో 4008 పరుగులు), రోహిత్ శర్మ (140 ఇన్నింగ్స్ల్లో 3853 పరుగులు), కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్ల్లో 2256 పరుగులు) ఈ ఘనత సాధించారు.