మరదల కోసం భార్యను కుమార్తెను హత్య చేసిన కిరాతకుడు

542

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో ఓ వ్యక్తి తన అందమైన భార్యను, అమాయకపు కుమార్తెను హతమార్చాడు. భార్యను వదిలేసి తన మరదలిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ వ్యక్తి తన భార్యను, కూతురిని హత్య చేశాడు. ఆ వ్యక్తి తన 22 ఏళ్ల భార్య, ఏడాది సంవత్సరమున్న కుమార్తెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. ఆ తర్వాత పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు.

Also Read : గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి

నిందితుడిని పోలీసులు నీరజ్ కుష్వాహగా గుర్తించారు. ఈ సంఘటన లలిత్‌పూర్‌లోని సదర్ కొత్వాలి ప్రాంతంలోని చంద్‌మారి గ్రామంలో జరిగింది. మృతుల మృతదేహాలను ఆ ప్రాంతంలోని వారి ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి తన భార్య, కుమార్తెపై దాడి చేసి హత్య చేశారని భర్త చెప్పాడు. రాత్రి 1.30 గంటలకు ఆరుగురు దుండగులు తమ ఇంట్లోకి ప్రవేశించారని, తన భార్య, కుమార్తెను హత్య చేశారని తెలిపారు. వారు తన నోటిలో సాక్స్‌లు కుక్కి, నగదు, నగలు దోచుకుని పారిపోయారని అతను చెప్పాడు.

నకిలీ గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ భర్త.. ఆసుపత్రిలో స్టేట్‌మెంట్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కానీ పోలీసులు అతని కథను నమ్మలేదు. ఇంకా అతనిపై అనుమానం పెరిగింది. అలా భర్తను విచారించగా జంట హత్యలు చేసినట్లు అంగీకరించాడు. తన భార్య అందంగా ఉండేదని, రోజంతా రీళ్లు చేసేదని.. సోషల్ మీడియాలో ప్రజలతో మాట్లాడేదని అతను చెప్పాడు. ఆమెను వదిలేసి తన మరదలిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ తన భార్య దానికి అడ్డు చెప్పడంతో క్రికెట్ బ్యాట్‌తో ఆమెను కొట్టి చంపానని, తనపై అనుమానం రాకుండా ఉండేందుకు దొంగతనం గురించి అందరికీ చెప్పానని తెలిపాడు. దొంగతనం చేసినట్లుగా కనిపించేలా ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి ఇంట్లోని టీవీ వెనుక ఆభరణాలను దాచిపెట్టాడు. అయితే భర్త పన్నిన పన్నాగాన్ని బట్టబయలు చేసిన పోలీసులు నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. 

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top