మేకను ఎత్తుకెళ్లారని ఇద్దరికి చిత్రహింసలు

79

మంచిర్యాల జిల్లా మందమర్రి లో దారుణం చోటు చేసుకుంది. మేకను దొంగతనం చేశారనే నెపంతో ఎస్సీ యువకుడితో పాటు పశువుల కాపరిని వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపింది.

మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పట్టణ శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకలను పెంచుతున్నారు.

Also Read: ఈటల రాజేందర్కు తప్పిన ప్రమాదం..

మేకల మండి లో నుండి రెండు మేకలను మాయం చేశారని నెపంతో మేకల కాపరితో పాటు అతని స్నేహితుడైన ఓ తాపి మేస్త్రీని విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో పశువుల కాపరి తేజ, ఎస్సీ యువకుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్‌పై అనుమానంతో ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. కింద పొగ పెట్టి వారిద్దరిని షెడ్డులో తలక్రిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు.

శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తన తమ్ముణ్ణి కట్టేసి కొట్టిన విషయం తెలియడంతో బాధితుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top