వరుణ్ తేజ్-లావణ్య భవిష్యత్తులో విడిపోతారు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!

118

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి నిత్యం సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పిన తర్వాత కొద్ది రోజులకు వారు విడిపోవడంతో జనాలు ఆయన మాటలు నమ్మడం మొదలెట్టారు. ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అయితే ఇటీవల వేణు స్వామి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుంటే తాను జాతకాలు చెప్పడం మానేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ కేసీఆర్ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో వేణు స్వామిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ జరిగాయి.

Also Read: YS Raja Reddy: షర్మిలక్కకు కాబోయే కోడలు..

ఇదిలా ఉంటే తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జాతకాలు చెప్పారు. ‘‘వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసుండే అవకాశాలు లేవు. లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది. వరుణ్ తేజ్ కు నాగ దోషం ఉంది. ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైన స్త్రీ మూలంగా విడిపోయే అవకాశం ఉంది. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో చెప్పిన మాటలు వాస్తవం అయ్యాయి. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ ముమ్మాటికీ నా మాటలు నిజం అవుతాయి’’ అంటూ వేణు స్వామి చెబుతున్నారు. కానీ ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయనపై ఫైర్ అవుతున్నారు.

Tags

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top